సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!

Share

రాప్తాడు నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులనుఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. శనివారం అనంతపురం లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 30 మంది లబ్దిదారులకు 34 లక్షల 43 వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు.
గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని కరోన కష్ట కాలంలో కూడా ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *